చిలకలూరిపేట: పట్టణంలోని తెలగ, బలిజ, కాపు కళ్యాణ మండప పునః నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజను ...
చిలకలూరిపేట: పట్టణంలోని తెలగ, బలిజ, కాపు కళ్యాణ మండప పునః నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజను ఘనంగా సత్కరించారు. జనసేన పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ, సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న చరణ్ తేజకు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అభినందనలు తెలియజేశారు.
చరణ్ తేజకు అరుదైన గౌరవం..
ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూమండలనేని చరణ్ తేజకు రాజకీయాల్లో అత్యంత అరుదైన గౌరవం దక్కిందని కొనియాడారు. జనసేన పార్టీ పట్ల ఆయన చూపిస్తున్న నిబద్ధత, ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం తగిన గుర్తింపునిచ్చిందని వారు పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు...
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చరణ్ తేజను 'ప్రదాత' అనే గౌరవ పదంతో పిలిచి, సముచిత స్థానం కల్పించడం పట్ల కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చరణ్ తేజ సేవలను గుర్తించి అతనికి ఈ స్థాయిలో గౌరవం కల్పించినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్సాహంగా సాగిన సన్మాన కార్యక్రమం
కళ్యాణ మండప పునః నిర్మాణ కమిటీ సభ్యులు చరణ్ తేజను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు, సామాజిక వర్గ ప్రముఖులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని చరణ్ తేజకు శుభాకాంక్షలు తెలియజేశారు.
COMMENTS