చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్ లో ఒక అరుదైన మరియు అత్యవసర వైద్య పరీక్షల అనంతరం వైద్యులు విజయవంతంగా ...
చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్ లో ఒక అరుదైన మరియు అత్యవసర వైద్య పరీక్షల అనంతరం వైద్యులు విజయవంతంగా ప్రసవం పూర్తి చేశారు. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లావు సుష్మా ఆధ్వర్యంలో జరిగిన ఈ శస్త్రచికిత్స ద్వారా ఒక పండంటి మగబిడ్డ జన్మించారు.
అత్యవసర పరిస్థితిలో LSCS శస్త్రచికిత్స.
గర్భిణీకి ప్రసవ సమయంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా, డాక్టర్ లావు సుష్మా తక్షణమే స్పందించి ప్రాథమిక అత్యవసర LSCS (సిజేరియన్) నిర్వహించారు. తల్లి, బిడ్డ ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా వైద్య బృందం ఈ నిర్ణయం తీసుకుంది.
CPD సమస్య అధిగమనం....
వైద్య భాషలో CPD అనగా తల్లి పొత్తికడుపు పరిమాణం కంటే శిశువు తల పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల సహజ ప్రసవం కష్టతరమవుతుంది. ఈ సమస్య ఉన్నప్పటికీ, డాక్టర్ సుష్మా గారు అత్యంత నైపుణ్యంతో శస్త్రచికిత్సను పూర్తి చేసి క్లిష్ట సమయాన్ని అధిగమించారు.
పూర్తి ఆరోగ్యంతో 3.7 కిలోల శిశువు..
సాధారణంగా శిశువుల బరువు కంటే ఎక్కువగా, అంటే 3.7 కిలోల బరువుతో ఈ మగబిడ్డ జన్మించారు. శిశువు పూర్తి కాలం (Full Term) గర్భంలో ఉండి, సరైన సమయానికి జన్మించడంతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తల్లిదండ్రుల ఆనందం..
దంపతులకు ఇది మొదటి సంతానం (ప్రథములు) కావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచి, మెరుగైన వైద్యం అందించిన డాక్టర్ లావు సుష్మాకు మరియు లీలావతి హాస్పిటల్స్ సిబ్బందికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
COMMENTS