ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండను సందర్శించారు. త్రికోటేశ్వర స్వామి వారిని ద...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండను సందర్శించారు. త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, రాష్ట్ర ప్రజల క్షేమం కోసం స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా కోటప్పకొండ పరిసర ప్రాంతాలు జనసైనికుల కోలాహలంతో సందడిగా మారాయి.
ఆత్మీయ ఆలింగనం..
పవన్ కళ్యాణ్ రాకనుపురస్కరించుకుని, జనసేన పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ కొండపైకి చేరుకోగానే చరణ్ తేజ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలో యువ నాయకుడి ఉత్సాహాన్ని, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తించిన పవన్ కళ్యాణ్, చరణ్ తేజను ఆత్మీయంగా హత్తుకున్నారు. ఈ దృశ్యం అక్కడ ఉన్న కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
జ్ఞాపిక బహుకరణ...
స్వామివారి దర్శనం అనంతరం, చరణ్ తేజ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తనకి ఇష్టమైన దైవం వారాహి అమ్మవారి విగ్రహాన్ని బహుకరించి గౌరవించారు. తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేస్తూ, చరణ్ తేజను అభినందించారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతానికి యువత పోషిస్తున్న పాత్రను ఈ సందర్భంగా కొనియాడారు.భక్తిభావం మరియు రాజకీయ ఉత్సాహం కలగలిసిన ఈ పర్యటన, చిలకలూరిపేట జనసేన శ్రేణుల్లో పెద్ద ఎత్తున జోష్ నింపింది. ముఖ్యంగా యువ నాయకత్వానికి పవన్ కళ్యాణ్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ భేటీ మరోసారి చాటిచెప్పింది.
COMMENTS