సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా బ్యాంకులు 'సూర్యఘర్' రుణాలు మంజూరు చేయాలి: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పల్నాడు జిల్లాల...
సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా బ్యాంకులు 'సూర్యఘర్' రుణాలు మంజూరు చేయాలి: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
పల్నాడు జిల్లాలో పీఎం సూర్యఘర్ ద్వారా నమోదు చేసుకున్న 90,000 కుటుంబాలకు నెలరోజుల్లోగా సౌర ప్యానెళ్లు ఇంస్టాల్ చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇళ్లకు వెండార్ల ఎంపిక వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామానికి వంద కుటుంబాలు లక్ష్యం చేసుకుని, ఒక్కో గ్రామాన్ని ఒక్కో వెండర్ కు అప్పగించడం ద్వారా పనులు పూర్తి చేయాలన్నారు.
శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో గంటలకు విద్యుత్ శాఖ అధికారులు - వెండర్స్ తో పీఎం సూర్యఘర్ పథకంపై ఎంపీ, జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మాట్లాడుతూ సూర్యఘర్ పథకానికి బ్యాంకు రుణం కోరే ప్రజలకు సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా రుణాలివ్వాలన్నారు. సరైన రిజిస్ట్రేషన్లు లేని ఇళ్లకు ఇంటి పన్ను రసీదు ఆధారంగా రుణం మంజూరు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డి.సి.ఆర్.బి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, విద్యుత్ శాఖ అధికారి డాక్టర్. కె. విజయ్ కుమార్, వెండార్లు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
COMMENTS