స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందుగా 2026 జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఐదేళ్ల పదవీకాలం ముగియడాన...
స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందుగా 2026 జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందుగా ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాట్ల మేరకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు బుధవారం లేఖలు రాశారు. ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్లో.. నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఆలోగానే జనవరిలో ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలో పేర్కొన్నారు.
ఆ లేఖ ప్రకారం ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇలా....
2025 అక్టోబరు 15లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
అక్టోబరు 16 నుంచి నవంబరు 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి, ప్రచురించాలి.
నవంబరు 1 నుంచి 15లోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి.
నవంబరు 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి.
డిసెంబరు 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి.
డిసెంబరు చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి.
2026 జనవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి, అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి.
.jpg)
COMMENTS