సేవా కార్యక్రమాలతో హోరెత్తనున్న జనసేన శ్రేణులు. చిలకలూరిపేట: జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ జన్మదినాన్ని పురస్కరించు...
సేవా కార్యక్రమాలతో హోరెత్తనున్న జనసేన శ్రేణులు.
చిలకలూరిపేట: జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ జన్మదినాన్ని పురస్కరించుకుని రేపు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జనసేన టీం చరణ్ తేజ ప్రకటించారు. రాజకీయాలకతీతంగావివిధ రంగాల ప్రముఖులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపే అవకాశం.
చరణ్ తేజ తన జన్మదినం సందర్భంగా రేపు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంట వరకు గణపవరం సి.ఆర్. కాలేజీ ఎదురుగా ఉన్నఎం వి ఆర్ కంపెనీ అందుబాటులో ఉంటారు. ఈ క్రమంలో వ్యాపారవేత్తలు, పార్టీ నాయకులు మరియు అభిమానులు ఆయనను కలిసి నేరుగా శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.
గడియారం స్తంభం వద్ద 5వ ఏడాది 'మహా అన్నదానం'..
తోట మల్లికార్జునరావు ఆధ్వర్యంలో చరణ్ తేజ జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద వరుసగా 5వ సంవత్సరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. పేదలకు, బాటసారులకు పెద్ద ఎత్తున భోజన సౌకర్యం కల్పించనున్నారు.
మానవత్వమే చాటుతూ.. పలు సేవా కార్యక్రమాలు..
కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, టీం చరణ్ తేజ ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు:
వృద్ధాశ్రమంలో అన్నదానం: స్థానిక వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు భోజన వితరణ.
ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ల పంపిణీ: ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయనున్నారు.
సేవా పథం: మరికొన్ని స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువకావాలని జనసేన కార్యకర్తలు నిర్ణయించారు.
ఈ వేడుకలను జయప్రదం చేయాలని, టీం చరణ్ తేజ తెలిపారు.
COMMENTS