నరసరావుపేట (రావిపాడు): వినియోగదారుల హక్కులను కాపాడటమే ధ్యేయంగా పల్నాడు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. సోమవారం నరసరావుపేట మం...
నరసరావుపేట (రావిపాడు):
వినియోగదారుల హక్కులను కాపాడటమే ధ్యేయంగా పల్నాడు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. సోమవారం నరసరావుపేట మండలం రావిపాడు గ్రామ పరిధిలోని ఒక ప్రైవేట్ పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజన సింహతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీలో భాగంగా అధికారులు ఈ క్రింది అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
కొలతల పరిశీలన...
పెట్రోల్ మరియు డీజిల్ పంపిణీలో సరైన కొలతలు పాటిస్తున్నారా లేదా అని 5 లీటర్ల జార్ల ద్వారా స్వయంగా పరీక్షించారు.
నాణ్యత పరీక్ష..
ఇంధన నాణ్యతను (Quality) తనిఖీ చేసేందుకు డెన్సిటీ చెక్ నిర్వహించారు.
స్టాక్ రిజిస్టర్..
బంకులోని నిల్వలు మరియు రికార్డులను పరిశీలించి, అమ్మకాల వివరాలనుసరిపోల్చారు.
వినియోగదారుల
సౌకర్యాలు...
బంకులో ఉచిత గాలి, తాగునీరు మరియు మరుగుదొడ్ల సౌకర్యం ఉందో లేదో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ,పెట్రోల్ బంకుల యాజమాన్యాలు లాభార్జనే ధ్యేయంగా కాకుండా,వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.ప్రజలకు అందించే పెట్రోల్, డీజిల్ విషయంలో ఎటువంటి తారుమారు జరిగినా సహించేది లేదు. కొలతల్లో మోసాలకు పాల్పడితే సదరు బంకుల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటాం అని కృతిక శుక్లా, జిల్లా కలెక్టర్ తెలిపారు.
జాయింట్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో తూనికలు మరియు కొలతల శాఖ అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.స్టాక్ బోర్డులను ప్రదర్శించాలని, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు మరియు పౌరసరఫరాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS