ఏపీలో జగన్ ఓటమి పాలయ్యారు. తిరిగి అధికారం ఖాయం అని భావించిన జగన్ కు భారీ పరాజయం మిగిలింది. కేవలం 11 స్థానాలకే జగన్ పార్టీ పరిమితం అయింది. ఓ...
ఏపీలో జగన్ ఓటమి పాలయ్యారు. తిరిగి అధికారం ఖాయం అని భావించిన జగన్ కు భారీ పరాజయం మిగిలింది. కేవలం 11 స్థానాలకే జగన్ పార్టీ పరిమితం అయింది. ఓటమి తరువాత వరుసగా పార్టీ నేతలతో జగన్ సమీక్షలు చేస్తున్నారు. భవిష్యత్ పైన భరోసా కల్పిస్తున్నారు. ఈ సమయంలోనే హైదరాబాద్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ నివాసం లోటస్ పాండ్ ప్రాంగణంలో ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయటం సంచలనంగా మారుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
జగన్ ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ లో ఇదే ప్రాంగణంలో నివాసం ఉండేవారు. అక్కడే పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించారు. 2019 ఎన్నికల ముందు తాడేపల్లిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని అక్కడే ఉంటున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల, విజయమ్మ..కుటుంబ సభ్యులు కొనసాగుతున్నారు. ఈ మధ్య కాలంలోనే జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుక వెళ్లిన సమయంలో చివరి సారిగా లోటస్ పాండ్ కు వెళ్లారు.
అక్కడ తల్లి విజయమ్మతో సమావేశం అయ్యారు. ఇక, ఇప్పుడు లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేత మొదలు పెట్టారు. అక్కడ కొంత మేర రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లుగా అభియోగాలు ఉన్నాయి. ఫుట్పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్ ల నిర్మాణం చేసినట్లు గుర్తించారు. గతంలోనే వీటిని తొలిగించాలని నోటీసులు ఇచ్చారు.
ఈ సెక్యూరిటీ పోస్టుల ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదులు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో..ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయటం సంచలనంగా మారింది. షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉండటం..తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది.

COMMENTS